Share News

పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరచండి

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:19 AM

పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరచండి
మునిసిపల్‌ కమిషనర్లతో మాట్లాడుతున్న జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి

రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

మునిసిపల్‌ కమిషనర్లతో జేసీ సమావేశం

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలోని మునిసిపల్‌ కమిషనర్లతో కలెక్టరేట్‌లో గురు వారం ఆయన సమీక్షించారు. పింక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలన్నారు. ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో కొబ్బరి బొండా లు, తాటి ముంజులు, జ్యూస్‌ షాపులు ఉండే ప్రాంతాలను గుర్తించి చెత్తను ఎక్కడ వేస్తున్నారు తెలుసుకోవాలన్నారు. రాత్రి సమయాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. పబ్లిక్‌ టాయిలెట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశుధ్యం నిర్వహణకు చర్యలు తీసుకోవాల న్నారు. ప్లాస్టిక్‌ వినియోగించే షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎండలు ఎక్కువగా ఉన్నందున రద్దీ ప్రాంతాల్లో చలి వేంద్రా లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు తీసుకునే జాగ్రత్తలపై అవగాహన బ్యానర్లను పెట్టాలన్నారు. దాతల సహకారంతో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. తినుబండారాలు, హోటల్స్‌ తనిఖీచేసి నాణ్యత పరిశీలించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ సోలార్‌ ప్యానల్‌ వినియో గంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి మునిసిపల్‌ కమిషనర్లకు సూచించారు. సమావేశంలో భీమ వరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు మునిసిపల్‌ కమిషనర్లు రామచంద్రారెడ్డి, ఎం.ఏసుబాబు, టి.రామ్‌ కుమార్‌, బి.విజయ సారథి, ఎం.అంజయ్య, జి.కృష్ణమోహన్‌, డీటీ ఎం సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:19 AM