Share News

YS Sharmila: బనకచర్ల కోసం పోలవరాన్ని బలిపెడతారా

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:12 AM

పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్‌ పథకం కోసం పోలవరం ప్రాజెక్టును sacrifice చేస్తారా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ, పోలవరం గరిష్ట సామర్థ్యాన్ని కుదించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు

YS Sharmila: బనకచర్ల కోసం పోలవరాన్ని బలిపెడతారా

  • పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): పోలవరం- బనకచర్ల రెగ్యులేటర్‌ పథకం కోసం పోలవరం ప్రాజెక్టును చంపుతారా అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంలో ఆదా పేరుతో ఏకంగా ప్రాజెక్టును బలి పెడతారా అని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం గరిష్ట సామర్థ్యం 194 టీఎంసీల నుంచి 114 టీఎంసీలకు కుదించారని మండిపడ్డారు. శనివారం విజయవాడలోని కాంగ్రెస్‌ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో పోలవరం నిర్వాసితుల అభిప్రాయలను షర్మిల సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి గోదావరి-బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌ను ముందుకు తెస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే నిర్వాసితులకు సహాయ, పునరావాసాన్ని అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 04:12 AM