Share News

Online Shopping: ఆన్‎లైన్ కొనుగోలు దారులకు అలర్ట్..ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాదుడు..

ABN , Publish Date - Mar 21 , 2025 | 08:34 PM

అమెజాన్, ఫ్లిప్‎కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్ల కోసం చూస్తున్నారా. అయితే ఓసారి ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి. ఎందుకంటే తాజాగా ఈ సంస్థలు కూడా ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించాయి.

Online Shopping: ఆన్‎లైన్ కొనుగోలు దారులకు అలర్ట్..ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాదుడు..
Amazon Processing Fee

ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రస్తుతం అనేక మందికి ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. కానీ అలాంటి వారికి ఇప్పుడు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కూడా తన ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ప్రతి ఒక్కరికీ డిస్కౌంట్లు, ప్రత్యేకంగా బ్యాంక్ ఆఫర్లంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో మీరు షాపింగ్ చేసినప్పుడు బ్యాంక్ ఆఫర్ ఆధారంగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (IBD) పొందడం ద్వారా కొంతమంది వ్యయాన్ని తగ్గించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్లను ఉపయోగించే కొనుగోలుకు అమెజాన్ ప్రత్యేకంగా రూ. 49 ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీజు విధానం 500 రూపాయల లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ వినియోగిస్తున్న వినియోగదారులకు వర్తిస్తుంది.


ప్రాసెసింగ్ ఫీజు విధానం ఎలా పనిచేస్తుంది

మీరు అమెజాన్‌లో ఒక ఆర్డర్ చేయాలనుకుంటే, ఈ కొత్త ఫీజు విధానం ఎలా పని చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. ఉదాహరణకి మీరు రూ. 5000 విలువైన వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఆ క్రమంలో బ్యాంక్ నుంచి రూ.500 డిస్కౌంట్ మీకు లభిస్తే, సాధారణంగా మీరు రూ. 4500 చెల్లించవచ్చు. కానీ ఇప్పుడు, అమెజాన్ రూ.49 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది, అంటే మీరు రూ.4,549 చెల్లించాల్సి ఉంటుంది.


ఈ కొత్త ఛార్జీ ఎవరికి వర్తిస్తుంది

  • 500 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ పొందినవారు

  • అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం ఈ రుసుము పెరుగుతుంది. అంటే ఈ రుసుము ప్రైమ్ సభ్యులకూ వర్తిస్తుంది.

  • మీరు రూ. 500 కంటే తక్కువ డిస్కౌంట్ పొందితే, మీరు ఈ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు

ఆర్డర్ రద్దు చేసినప్పుడు లేదా తిరిగి ఇచ్చినప్పుడు

మీరు అమెజాన్‌లో ఆర్డర్‌ను రద్దు చేసినప్పుడు లేదా తిరిగి ఇచ్చినప్పుడు, మీరు చెల్లించిన ప్రాసెసింగ్ ఫీజు తిరిగి పొందలేరు. ఒకసారి ఈ రుసుము వసూలు చేసిన తర్వాత, అది తిరిగి ఇవ్వబడదు.


మీరు ఏం చేయాలి?

మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయాలనుకుంటే, చెక్‌ఔట్ చేసేముందు మీ డిస్కౌంట్ సరిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ క్రమంలో రూ. 49 రుసుము వర్తిస్తుందో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు రూ. 500 కంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ పొందినప్పుడు ఈ ఫీజు అప్లై అవుతుంది. దీని అర్థం మీరు కొన్ని వస్తువులను తీసుకుని కార్ట్‌లో సర్దుబాటు చేస్తే, మీరు అదనపు ఛార్జీలను నివారించుకోవచ్చు. మరోవైపు ఫ్లిప్ కార్ట్ కూడా ఇప్పటికే ఈ ఛార్జీలను వసూలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 21 , 2025 | 08:44 PM