Reliance Capital : రిలయన్స్ క్యాపిటల్ దివాలా సుఖాంతం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:53 AM
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది.

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సుఖాంతమైంది. హిందుజాల నేతృత్వంలోని ఇండ్సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) రూ.10,000 కోట్లతో ఈ కంపెనీని దక్కించుకుంది. రుణదాతలు, రెగ్యులేటరీ సంస్థల ఆమోదాలూ పూర్తయ్యాయి. కంపెనీ డైరెక్టర్ల బోర్డునీ పునర్ వ్యవస్థీకరించారు. దీంతో ఈ నెల 19న రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కార ప్రక్రియ పూర్తయిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తానికి వై నాగేశ్వర రావు దివాలా పరిష్కార పరిష్కర్తగా వ్యవహరించారు. దేశంలో దివాలా పరిష్కార ప్రక్రియకు వచ్చిన తొలి ఎన్బీఎఫ్సీ కూడా రిలయన్స్ క్యాపిటలే.

జియో బంపర్ ఆఫర్.. రీఛార్జ్ ప్లాన్లతోపాటు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్..

ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Vi: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వీఐ నుంచి నయా రీచార్జ్ ప్లాన్స్

ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్
