Share News

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

ABN , Publish Date - Mar 18 , 2025 | 02:47 PM

టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా బడ్జెట్ ధరల్లో BSNL మరో ప్లాన్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.199కే డైలీ 3జీబీ డేటా అందుబాటులోకి రావడం విశేషం.

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
rs 599 Plan 84 Days of Daily 3GB Data

దేశ టెలికాం రంగంలో పోటీ క్రమంగా మరింత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రీఛార్జ్ ప్లాన్ల విషయంలో ఆయా సంస్థలు పోటీ పడి మరి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తాజాగా మరో క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారుల కోసం 84 రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. డేటా, కాలింగ్ వంటి అనేక సేవలను అందిస్తోంది.


252GB డేటా

ఈ రూ.599 ప్లాన్ ద్వారా రోజుకు 3GB హై స్పీడ్ డేటా అందిస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 84 రోజుల పాటు రోజుకు 3GB హై స్పీడ్ డేటా, అంటే మొత్తం 252GB డేటా వినియోగంలోకి రానుంది. దీనిని గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సహా పలు రకాల పనులను ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ లెక్కన చూస్తే నెలకు 199 రూపాయలు మాత్రమే పడనుంది.


100 ఉచిత SMSలు

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించబడతాయి. అంటే, మీరు ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చ. అలా మీరు ఇతర నెట్‌వర్క్‌లతో కూడా లిమిట్ లేకుండా మాట్లాడుకోవచ్చు. దీంతోపాటు 100 ఉచిత SMSలు ప్రతిరోజూ లభిస్తాయి. ఇది మీకు రోజువారీ కమ్యూనికేషన్‌కు ఉపయోగపడుతుంది.


అన్ని సేవలను కూడా..

ఈ 84 రోజుల ప్లాన్ ప్రధానంగా ధీర్ఘ కాలం రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారులు, ఇలాంటి ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా అవసరమైన అన్ని సేవలను పొందవచ్చు. దీంతో ఈ ప్లాన్ ద్వారా మీరు వారానికి లేదా నెలకు రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం లేకుండా, డేటా, కాలింగ్ సేవలను ఈజీగా పొందవచ్చు.


నెట్‌వర్క్ విస్తరణ

తాజాగా, BSNL తన 4G నెట్‌వర్క్‌ను భారత్‌లో విస్తరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 75,000కి పైగా 4G మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేసింది. త్వరలోనే మరో లక్ష టవర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4G నెట్‌వర్క్ విస్తరణతో BSNL అంచనాల ప్రకారం, తన వినియోగదారులకు మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇందులో భాగంగా, దేశంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో కూడా 4G సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.


ఉదాహరణ:

  • సుక్మా, ఛత్తీస్‌గఢ్: CRPF బేస్ క్యాంప్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 4G మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేశారు

  • అండమాన్, బార్ దీవులు: అక్కడి స్థానికులు డిజిటల్ యాక్సెస్‌ను పెంచుకునే అవకాశం ఉంది

  • BSNL ఏకైక ప్రభుత్వ టెలికాం ప్రొవైడర్‌గా, ఒక అద్భుతమైన నెట్‌వర్క్ శక్తిని కలిగి ఉంది. ఇది దేశంలోని చాలా ప్రాంతాలలో సమర్థవంతమైన సేవలను అందిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 18 , 2025 | 02:48 PM