రైతు సమస్యల పరిష్కారంలో ముందుండాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:08 AM
గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి అన్నారు.

ఎల్లారెడ్డిపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముందుండాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు అన్వేష్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళుతున్న ఆయన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి, పదిర గ్రామాల్లోని ఆ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్రెడ్డి, మద్దుల పద్మారెడ్డిల ఇళ్లకు బుధవారం చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలతో ఈ ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అందుబాటులో విత్తనాలు ఉండేలా చూడాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే తనను నేరుగా వివరించాలని పేర్కొన్నారు. నాయకులు హరిభూషన్, గిరిధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సాహెబ్, వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.