Home » Telangana » Karimnagar
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు.
జిల్లాలోని కథలాపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 120 మంది విద్యా ర్థులుండగా కేవలం 37 మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. కళాశాల కేవలం 31శాతం ఉత్తీర్ణతను సాధించింది. ప్రథమ సంవత్సరం లో 157 మంది విద్యార్థులుండగా కేవలం 17 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. కేవలం 10.82 శాతం ఉత్తీర్ణతను కళాశాల సాధించింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు విస్తరణ ఎదురు చూపులకే పరిమితమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను విభజించడంతో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల్లో ఇప్పటి వరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ఏర్పాటు చేయలేదు.
ప్రస్తుత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన పనుల విషయమై అధికార యంత్రాంగం తంటాలు పడుతున్నది. ప్రతిరోజు ఉదయమే అదనపు కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పనులు ముందుకు సాగేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోని నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలకేంద్రంలో శుక్రవారం రోడ్షో నిర్వహించారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద పోలీసులు నిర్వహించిన నాకబందీలో భాగంగా వాహనాల తనిఖీని పరిశీలించారు.
రుణమాఫీ కాకూడదనేదే బీఆర్ఎస్ ఆంతర్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలోని చీర్లవంచలో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఐదేళ్లలో ఎంపీ బండి సంజయ్కుమార్ కరీంనగర్కు గానీ, పార్లమెంట్ నియోజకవర్గానికి, ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ వాకర్స్ను కలిసి ఎంపీగా తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
బీజేపీ అంటే భారతీయుల ఆత్మ అని ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ అన్నారు. మానకొండూర్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో దళిత సమ్మేళనం నిర్వహించారు.
కరీంనగర్ బస్స్టాండ్, రైల్వేస్టేషన్లలో వాహన తనిఖీలు ఇతర రద్దీ ప్రదేశాల్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.