Home » Telangana » Karimnagar
ఉత్తర తెలంగాణలో కరీంనగర్ను స్మార్ట్ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సిబ్బంది చాలీచాలనీ వేతనాలు, అధిక పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ పేద కూలీలకు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి కల్పన, సుస్థిర ఆస్థుల కల్పన, గ్రామీణ పేదల జీవనోపాధి వనరులను శక్తివంతం చేసే కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకవచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేయడం అధికారులకు కత్తి మీద సాములా మారను న్నది. జిల్లా వ్యాప్తంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలో స్వయం ఉపాధి కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువ తీ, యువకులు దరఖాస్తు చేసుకున్నారు.
వేసవిలో వన్యప్రాణులు నీరు దొరకక అల్లాడుతుంటాయి. అలాగే చిన్న పొరపాటుతో అడవిలో మంటలు చెలరేగి చెట్లు ఆహుతవుతాయి. మంటలు అంటుకోకుండా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
ఆధార్ కార్డు లాగానే ప్రతీ భూమికి భూధార్ కార్డు ప్రభుత్వం తీసుకు వస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మేడారం రైతువేదికలో ఏర్పాటు చేసిన భూ భారతిపై అవగాహన సదస్సులో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు వివరించారు. ధరణి పోర్టల్లో లేని పలు అంశాలు భూ భారతిలో ప్రభుత్వం పొందు పరచిందని పేర్కొ న్నారు.
అకాలంగా కురిసిన వర్షంతో నష్టపోయిన రైతు లు మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతితో రైతుల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన భూభారతితో రైతుల భూసమస్యలు పరిష్కారం అవుతాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు.