బోరు మోటార్ తీయబోయి యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:26 PM
వ్యవసాయ బావిలో బోరు మోటార్ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది.
అమరచింత, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ బావిలో బోరు మోటార్ను తీయ బోయి ప్రమా దవశాత్తు నీటిలో ము నిగి మృతి చెందిన సంఘటన శనివారం వనపర్తి జిల్లా అమర చింత మునిసిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అమరచింత ప ట్టణానికి చెందిన రైతు గోపాల్రెడ్డి వ్యవసా య బావిలోని మోటార్ను మరమ్మతు ని మిత్తం తీయడానికి గుడిసె శ్రీను (28) శ నివారం వెళ్లాడు. బావిలోని నీటిలో బోరును బయటకు తీయడానికి తీవ్ర ప్రయత్నం చే సే క్రమంలో ఆ బోరుతో పాటు నీటిలో యువకుడు పూర్తిగా మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. సాయంత్రం కుటుం బ సభ్యులు, ప్రజలు వెళ్లి అతి కష్టం మీద మృతుడిని బావిలో నుంచి బయటకు తీశా రు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.