భూ భారతి చట్టంతో రైతులకు న్యాయం
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:23 PM
ప్ర భు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు.
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి
ఉండవల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్ర భు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చట్టాన్ని ప కడ్బందీగా తయారు చేశారని రైతులకు వివరిం చారు. సోమవారం ఉండవల్లిలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 అవ గాహన సదస్సుకు ఎంపీ ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డుతూ భూ భారతి చట్టం భూ సమస్యల పరి ష్కారానికి గొప్ప చట్టమన్నారు. భూ భారతి చ ట్టం ద్వారా కలిగే ప్రయోజనాలను కలెక్టర్ బీ ఎం సంతోష్ వివరించారు. రైతు సదస్సు అనం తరం సోమవారం రాత్రి ఉండవల్లిలో ప్రభుత్వ బాలుర వసతిగృహాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల కోసం ఎంపీ ఫండ్ ద్వారా కోటి రూపా యలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలం పూర్ జోగుళాంబ రైల్వేస్టేషన్ హాల్ట్ను పరిశీలిం చారు. రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రిని తనిఖీ చేశారు. త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు.