Share News

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:19 AM

దళారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన ఉబ్బు వెంకటయ్య అన్నారు.

 దళారులకు ధాన్యం విక్రయించొద్దు
చౌటుప్పల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య

చౌటుప్పల్‌ టౌన, ఏప్రిల్‌ 17 ( ఆంధ్రజ్యోతి): దళారులకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దని చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన ఉబ్బు వెంకటయ్య అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం తో పాటు ధాన్యం శుభ్రం చేసే అధునిక యంత్రాన్ని ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన చింతల దామోధర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మునుగోడు అసెంబ్లీ ఇనచార్జ్‌ పబ్బు రాజుగౌడ్‌, తహసీల్దార్‌ హరికృష్ణ, ఏఎంసీ వైస్‌ చైర్మన ఆకుల ఇంధ్రసేనారెడ్డి, సెక్రటరీ వి.రవీందర్‌రెడ్డి, ఏవో నాగరాజు, సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన బి.మురళి, మొగుదాల రమేష్‌, పీఏసీఎస్‌ సెక్రటరీ వై.రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:19 AM