Rajeev Yuva Vikasam Scheme: రూ.50 వేల యూనిట్కు పూర్తి రాయితీ
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:29 AM
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రూ.50 వేలలోపు యూనిట్కు 100% రాయితీతో సహా వివిధ వివరాలతో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది

రూ.2 లక్షలకు పైన యూనిట్లకు 70 శాతం
5వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ
జూన్ 2న ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు
రేషన్కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం
గరిష్ఠ వయోపరిమితి 55 ఏళ్లు.. రైతులకు 60 ఏళ్లు
ఐదేళ్ల కాలానికి కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి
పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి మరో ముందడుగు పడింది. లబ్ధిదారుల అర్హతలు, వయో పరిమితి, వార్షికాదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. రూ.50 వేలలోపు యూనిట్కు 100ు రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. మిగతా యూనిట్లకు కూడా 70ు నుంచి 90ు వరకు రాయితీలను ప్రకటించింది. అంతేకాదు.. రాయితీ మొత్తం పోను.. మిగతాదాన్ని లబ్ధిదారుడి వాటాగా కాకుండా.. బ్యాంకు రుణంగా అందజేయనున్నట్లు వెల్లడించింది. రాజీవ్ యువ వికాసం పథకానికి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ (జ్ట్టిఞట://్టజౌఛఝఝటుఽ్ఛఠీ.ఛిజజ.జౌఠి.జీుఽ/) ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఈ ప్రక్రియ ఏప్రిల్ 5 వర కు కొనసాగుతుందని, అదే నెల 6 నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుందని వివరించింది. ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొంది. ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపింది.
రాయితీలు ఇలా..
యూనిట్ విలువను బట్టి రాయితీ మారుతుంది. రాయితీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా ఉండదు
యూనిట్ విలువ రూ.50 వేలలోపు ఉంటే.. ప్రభుత్వం 100ు రాయితీ ఇస్తుంది
రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు ఉండే యూనిట్కు 90ు రాయితీ ఉంటుంది
రూ.1,00,001-రూ.2లక్షలకు 80ురాయితీ ఇస్తారు
రూ. 2 లక్షలకు పైన విలువ చేసే యూనిట్కు 70ు రాయితీ లభిస్తుంది
అర్హులు వీరే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ల సభ్యు లు, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్లు, ఈబీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వ యసు 21 నుంచి 55 ఏళ్లలోపు ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి గరిష్ఠ వయోపరిమితి 60 సంవత్సరాలు. దరఖాస్తుదారులకు రేషన్కార్డు తప్పనిసరి. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకుండా ఉండాలి. ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు సమయంలో పాస్పోర్టు సైజు ఫొటోను అప్లోడ్ చేయాలి. రవాణా రంగానికి సంబంధించిన యూనిట్ను ఏర్పాటు చేసేవారికి డ్రైవింగ్ లైసెన్సు, వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదార్ పాస్పుస్తకం తప్పనిసరి. ది వ్యాంగులు సదరం సర్టిఫికెట్ను సమర్పించాలి.
వీరికి ప్రాధాన్యత..
మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు మొత్తం లక్ష్యంలో 25ు ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారికి ఈ పథకంలో ప్రాధాన్యతనిస్తారు. కుటుంబానికి ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరుస్తారు. అంటే.. ఐదేళ్ల వరకు ఆ కుటుంబానికి చెందిన ఇతరులు ఈ పథకానికి అనర్హులు.
వచ్చేనెల 5 వరకు దరఖాస్తులు
ఈ పథకానికి ఈనెల 17 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చేనెల 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓబీఎంఎంఎస్ పోర్టల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అనుమానులు ఉంటే.. నివృత్తి చేయడానికి హెల్ప్డెస్క్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, అర్హత పత్రాలతోపాటు హార్డ్ కాపీని సంబంధిత అధికారులకు అందజేయాలి. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులు ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల వారు పురపాలక సంఘాల్లో, నగరాల్లో ఉండేవారు నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయాల్లో దరఖాస్తు కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడు వు ముగిసిన తర్వాతి రోజు నుంచే.. అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 20 వరకు నెలన్నరపాటు మండల స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఒకే గ్రామంలో బహుళ స్వయం ఉపాధి పథకాలకు అవకాశం ఉండదు. అర్హతకు సంబంధించిన స్ర్కూటినీ పూర్తయ్యాక.. ఎంపిక చేసిన దరఖాస్తులను జిల్లా స్థాయి పరిశీలనకు పంపుతారు. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయిలో పరిశీల ఉంటుంది. ఆ తర్వా త ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపుతారు. మంత్రి ఆమోదం పొంది న దరఖాస్తులను ఈ పథకంలో లబ్ధికి ఎంపిక చేస్తా రు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న స్వయం ఉపాధిలో వారం నుంచి పక్షం రోజుల పాటు శిక్షణనిస్తారు. రాయితీ విడుదల అయిన 16 రోజుల్లో లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
జిల్లా, మండల స్థాయి కమిటీలు..
జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్గా డీఆర్డీయే పీడీ ఉంటారు. సభ్యులుగా.. అదనపు కలెక్టర్, పరిశ్రమల శాఖ జీఎం, ఎస్సీ/బీసీ కార్పొరేషన్ల ఈడీ, జిల్లా మైనార్టీ సంక్షే మ అధికారి, దివ్యాంగుల శాఖ ఏడీ, డబ్ల్యూ అండ్ సీడీ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీటీడీవో, ఎల్డీఎంలు ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో/పురపాలక కమిషనర్, మునిసిపల్ కార్పొరేషన్లో జోనల్ స్థాయి అధికారి కన్వీనర్గా ఉంటారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన మండల ప్రత్యేక అధికారి, ఆ ప్రాంతంలోని బ్యాంక్ మేనేజర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల నుంచి ఒక ప్రతినిధి, డీఆర్డీఏ నుంచి ఒక సభ్యుడు ఈ కమిటీలో ఉంటారు.
ఈబీసీ సంక్షేమ సంఘం హర్షం
ఈ పథకంలో తమ వర్గానికి కూడా అవకాశం ఇచ్చినందుకు ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ