Home » Revanth Reddy
తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం.. ప్రజా కార్యక్రమాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు.
సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.
నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
‘‘కేసీఆర్.. రైతుభరోసా వచ్చిందో రాలేదో.. ఏ రైతు ఖాతాలోనైనా చూడు. ఈ నెల 9లోపు రైతుభరోసా వేస్తానని.. వేయలేకపోతే అమరవీరుల స్తూపం వద్ద
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్ పోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను.. గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్లో సీఎం రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.