నన్ను కాపాడండి.. మనుబోలు శ్రీనివాసరావు
ABN, Publish Date - Mar 20 , 2025 | 12:38 PM
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణ హాని ఉందంటూ జనసేన సమన్వయ కర్త మనుబోలు శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, మట్టి, మద్యంలో అవినీతి వాటా ఎంతో ప్రజలకు కొలికపూడి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు (Tiruvuru) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao)తో తనకు ప్రాణ హాని (Life Threat) ఉందంటూ జనసేన (Janasena) సమన్వయ కర్త మనుబోలు శ్రీనివాసరావు (Manubolu Srinivasa Rao) ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, మట్టి, మద్యంలో అవినీతి వాటా ఎంతో ప్రజలకు కొలికపూడి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద ఎమ్మెల్యే రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు తన వద్ద పూర్తి సమాచారం ఉందని.. ఈ విషయం వాళ్ల నాయకులే చెప్పారన్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక్కో ఉద్యోగి నుంచి రూ. 6 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. బాధితుడు ఇచ్చిన స్టేట్మంట్ ఉందని మనుబోలు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
ఈ వార్తలు కూడా చదవండి..
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం..
For More AP News and Telugu News
Updated at - Mar 20 , 2025 | 12:38 PM