వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.
మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.నలుగురు విద్యార్థినులు వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట ఎంఈఓ-2 రామచంద్రపై సస్పెన్షన ఎత్తివేశారు. ఈయన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీ హైస్కూల్ హెచఎంగా ఉన్న సమయంలో నాడు, నేడు పనుల్లో అక్రమాలు జరిగాయని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది.
విద్యారంగ పరిరక్షణకు రాజీలేని పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థిబ్లాక్ జాతీయ కన్వీనర్ బాలజయవర్దన, పార్వర్డ్బ్లాక్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీవీసుందరరామరాజు పేర్కొన్నారు. అఖిలభారతవిద్యార్థిబ్లాక్ 3వ రాష్ట్రమహాసభలు బుధవారం వారు నగరంలో నిర్వహించారు.
స్థానిక మున్సిపల్ 15వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ గౌతమి టీడీపీలోకి చేరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వగృహంలో ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వ ర్యంలో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు
వజ్రకరూరు మండలం కొత్త కడమలకుంటలో పాఠశాలలో 1వ నుంచి 5వ తరగతి వరకూ 25 మంది విద్యార్థులు న్నారు. ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పెచ్చులూడి పడుతున్నాయి. ఇనుపకడ్డీలు కనిపిస్తున్నాయి. ఇటీవల పెచ్చులూడి ఉపాధ్యాయుడిపై మీద పడ్డాయి.
వజ్రకరూరు మండలంలోని రాగుల పాడు, కొనకొండ్ల గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాలను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారలకు ఆదేశించారు.