ఇన సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మ హేశకు వినతిపత్రం అందజేశారు.
సత్య సా యి బాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్లిఓ జ రిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదుచేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్రెడ్డికి సూచించారు.
కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు.
కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు.
నకిలీ బంగారంతో మోసం చేయాలని చూసిన ముఠాను బ్యాంక్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రముఖ సిమెంట్ కంపెనీల పేరుతో నకిలీ సిమెంట్ను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.
కాయదశలో ఉన్న కందిపంటకు రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో విజయభారతి తెలిపారు. మంగళవారం సూచించారు. కేతగానిచెరువు, రెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు.
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ సురే్షబాబు ఆదేశించారు.
గోరంట్ల మండలంలో అనువైన చోట యాదవ కల్యాణమండపానికి స్థలం కేటాయిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మంగళవారం రాష్ట్ర యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య గోరంట్లకు చెందిన యాదవ సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు.