టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుమార్తె వివాహం కోసం ఉంచిన బంగారంతోపాటు నగదును దొంగలు చోరీ చేశారు.
గత వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించిన నెయ్యి కల్తీ.. పరకామణిలో చోరీ కేసు రాజీ.. చివరికి శ్రీవారిని దర్శించే ప్రముఖులు, భక్తులకు కప్పే పట్టువస్త్రాల కొనుగోలులోనూ దగా.. పట్టు పేరిట పాలిస్టర్ వస్ర్తాలు కొనుగోలు చేసి మోసం చేశారు.
‘వాష్రూములో ఏడు ఆర్డీఎక్స్ ఆధారిత పేలుడు పదార్థాలు పెట్టాం. అవి ఏ సమయంలోనైనా పేలొచ్చు’ అంటూ తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు బుధవారం ఈమెయిల్ వచ్చింది. భయాందోళనకు గురైన అధికారులు వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందుకు సమాచారమిచ్చారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మిస్సింగ్ అయిన వ్యక్తి.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే అభిప్రాయాన్ని ప్రముఖ ఆర్ధికవేత్త, విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తికే ప్రత్యేకమైన ఏడు గంగమ్మల జాతర బుధవారం ఘనంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో పట్టణం మార్మోగింది. అమ్మవార్లు కొలువుదీరే ఏడు ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుంచే చలువు పందిళ్లు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏడు ప్రాంతాల్లో అమ్మవారి ఉత్సవమూర్తులు మంగళవారం అర్ధరాత్రిపైన విశేష అలంకారంలో ఊరేగింపునకు సిద్ధం చేశారు.
జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్రాజును తిరుపతి రూరల్ మండలానికి.. అక్కడ పనిచేస్తున్న రామాంజులు నాయక్కు కలెక్టరేట్ ఏవోగా పోస్టింగ్ ఇచ్చారు.
తిరుపతి కలెక్టరేట్లో ఇ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు వేగంగా జరుగుతోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల వద్ద ఆరు నెలల కాలంలో పెండింగు పడిన ఫైళ్ళ సంఖ్య సున్నా. కలెక్టర్ వద్దకు వస్తున్న ఫైళ్ళను క్లియర్ చేయడంలో కనిష్ఠంగా ఒకటిన్నర రోజు నుంచీ గరిష్ఠంగా రెండున్నర రోజుల వ్యవధి తీసుకుంటున్నారు. పైళ్ల క్లియరెన్సులో మంత్రులు, సెక్రటరీలు (ఐఏఎస్), సెక్రటరియేట్ డిపార్ట్మెంట్ వారీగా, హెచ్వోడీ్సలతో పాటు కలెక్టర్, జేసీలు ఏ స్థానంలో ఉన్నారో ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
సూళ్లూరుపేట కేంద్రంగా ఏటా మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిపే పక్షుల పండుగ ఈసారి రెండు రోజులే నిర్వహించనున్నట్లు సమాచారం. 2000 నుంచి ఏటా మూడు రోజుల పాటు పక్షుల పండుగ నిర్వహిస్తున్నారు.
మద్రా్సలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ రూ.1500 లంచం తీసుకున్నాడని సుప్రీంకోర్టు నాలుగు రోజుల కిందట రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హెడ్మాస్టర్కి ఒక రూలూ, పరకామణి దొంగకి ఒక రూలా? మాజీ ముఖ్యమంత్రికి ఒక రూలూ, బడిపంతులకు మరొక రూలా? ఏమిటిది? టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి.