ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష గురువారం నుంచి ప్రారంభకానుంది. ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రికి తరలి రానున్నారని అధికారలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను అందిస్తోంది. క్యూఆర్తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ఆగష్టు నుంచి జరుగుతున్నప్పటికీ ఇంకా వేల మంది తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం మరోసారి ప్రజలను అలర్ట్ చేసింది.
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.
ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరే్ంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు వడ్డమాను రైతులు అంగీకారం తెలిపారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు గ్రామ రైతులు మద్దతుగా నిలిచారు.
ఈ ఏడాది దాదాపు 6 లక్షల మందికిపైగా భవానీలు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోనున్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.
వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకుని చేపట్టే ‘అటల్ సందేశ్-మోదీ సుపరిపాలన’ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజకీయ భీష్మునిగా భావించే అటల్ జీ శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషమన్నారు.