భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని జడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం పరిపాలన భవనంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అధికారులు సరస్వతమ్మ, సి.రాంగోపాల్, బసవశేఖర్, మహ్మద్ హక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిత్రంలో కనిపిస్తున్నది ఎర్రగుంట కొట్టాల గ్రామం. 278 జనాభా ఉండగా, అందరూ వ్యవసాయ కూలీలే. గ్రామానికి నేటికీ రహదారి కూడా సరిగా లేదు. గ్రామంలో చాలామంది పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకున్నా, అవి మంజూరు కాలేదు. అలాగే మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల నివారణపై విసృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ సునీల్ షెరాన్ అధికారులను సూచించారు
కర్నూలులో క్రీడల అభివృద్ధికి సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం డిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ్యన్ కలిసి వినతి పత్రం అందించారు.
కప్పట్రాళ్ల గ్రామంలోని పేద విద్యార్థిని (మైమూన్) మొదటి విడతలోనే తిరుపతిలోని వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో అర్హత సాదించింది.
వ్యాసరచన, వక్తత్వ పోటీలతో విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించామని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
ఆదరణ కోల్పోయి, వృద్ధాప్యంలో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాంథన్ యోజన పథకం తెచ్చింది.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏడీఏ సుధాకర్ అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య అన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడులు కొన్న రోజునే రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వ నిబంధన. అతిక్రమిస్తే వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారు.