యాంటీ బయాటిక్స్ను పరిమితికి మించి వాడరాదని, వైద్యుల ప్రిస్కిప్షన్లు లేకుండా మందులు అమ్మరాదని కలెక్టర్ సిరి హెచ్చరించారు.
పట్టణ శివారులోని బసాపురం రహదారిలో ఉన్న హరి కాటన్ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
ఆదోని జిల్లా ఏర్పాటు గురించి మంగళవారం విజయవాడలో జిల్లా ఇన్చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో జరిగిన జిల్లా నాయకుల భేటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఆదోని జిల్లా ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.
సింగిల్ డెస్క్ ద్వారా అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించి, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం రూ.3,06,81,661 నగదు వచ్చినట్లు ఏఏవో మాధవ శెట్టి మఠం మేనేజర్లు ఎస్కె శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు.
లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి
ప్రజా ఫిర్యాదుల పరిష్కర వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని నగర పాలిక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు
ఎన్నిల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ పెర్కొన్నారు. సోమవారం కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నేషనల్ కేరీర్ సర్వీసు, ఏపీఎస్ఎస్డిసీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. విద్య, ఐటీ మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు కానున్న కంపెనీలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు
స్టాండింగ్ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ నెల 6న నిర్వహించాల్సిన సమావేశం సభ్యులు రాకపోవడంతో వాయిదా వేసిన సంగతి విదితమే. అయితే సోమవారం నిర్వహించిన సమావేశంలో 22 అంశాలు ప్రవేశపెట్టగా కేవలం 4 తీర్మానాలను మాత్రమే సభ్యులు ఆమోదించారు. తమను లెక్కచేయడం లేదని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
): తెలంగాణ రాష్ట్రం అలంపూర్ మండలం రాలంపేటకు చెందిన గంగాధర్, రేణుక దంపతుల 18 నెలల కూతురు గీతాన్షికి ఉన్నట్లుండి నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా ఇంజెక్షన్లు వేయాలని, చికిత్సకు రూ.3 లక్షలు పైగా ఖర్చు అవుతుందని చెప్పగా.. నిరుపేదలు కర్నూలు జీజీహెచ్ చిన్న పిల్లల విభాగానికి నవంబరు 29వ తేదీన వచ్చారు.