Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.
Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.
Minister Narayana: డ్రైయిన్లు పూడిక తీత పనులు వెంటనే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీల్లో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Dowry Harassment: నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను చూస్తే ఆడపిల్లలు పెళ్లి అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుందేమో. ఆ మహిళపట్ల అత్తింటి వారు ప్రవర్తించిన తీరు చూస్తే కన్నీరుపెట్టకుండా ఉండలేరు.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Aabdul Aziz: వక్ఫ్ బోర్డు ఆస్తుల విక్రయంపై ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆస్తుల వివరాలను ఆయన వివరించారు. రంజాన్ మాసంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం తెలంగాణకు వెళ్లానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఆయన వివరించారు.
Illegal Mining Case: నెల్లూరు క్వార్ట్జ్ అక్రమాల కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రభాకర్ రెడ్డి.. న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Venkaiah Naidu: ప్రస్తుత పాలకులు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందివ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ప్రజలు ప్రతిరోజూ రామాయణం, మహాభారతం చదవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.
Kakani Skipping Police Inquiry: పోలీసుల విచారణకు సహకరించకుండా హైడ్రామాకు తెరలేపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మూడవ సారి కూడా పోలీసుల విచారణకు మాజీ మంత్రి గైర్హాజరయ్యారు.