నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియని దారుణహత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ.
రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
CID వేసిన పిటీషన్పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.
సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక అర్హత కాకాణికి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకాణికి సిగ్గు, శరం లేదని విమర్శించారు. త్వరలో కాకణి భూ దోపిడీని ఆధారాలతో సహా బయట పెడుతానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
నేపాల్లో కొనసాగుతున్న అశాంతి మధ్య చిక్కుకున్న తెలుగు పౌరులను తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ కార్యకలాపాలకు ఐటీ & మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ప్రత్యక్ష బాధ్యత తీసుకున్నారు.
ఆదిచుంచనగిరి మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, యూనివర్సిటీలను నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి లోకేశ్ కితాబిచ్చారు. ఈ మేరకు పాఠశాలల గురించి అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.
తనపై హత్య కుట్రకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియాల్లో ఎన్ని వీడియోలు పెట్టుకున్నా తనకేం భయంలేదని.. కానీ, ఓ పౌరుడిగా తనకు న్యాయం చేయాలని కోరారు.
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు స్కెచ్ వేసినట్లు ఒక వీడియో బహిర్గతమైంది. ఆయన్ని హత్య చేస్తే.. డబ్బే డబ్బు అంటూ సదరు వీడియోలో రౌడీషీటర్లు చర్చించుకోంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అదే జరిగితే, రాయలసీమ ప్రాంతానికి రెండవ పంటకి సాగునీరు ఇవ్వగలమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తవుతున్నాయన్నారు.