దశాబ్దాల నుండి కనీస మరమ్మతులకు కూడా నోచుకోని పలు రోడ్లకు విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడంతో అవి కొత్తరూపును సంతరించుకున్నాయి.
ల్లాలో వరి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు.
మార్కాపురం పట్టణ పరిధిలోని ప్రధాన రహదారులు ప్రాంతాన్ని బట్టి గతంలో 40 నుంచి 80 అడుగుల వెడల్పుతో ఉండేవి. కాలక్రమంలో ఆక్రమణల పుణ్యమా అని రహదారులు కుంచించుకుపోయాయి.
మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడులో 9వతరగతి చదువుతున్న బాలికకు జరుగుతున్న వివాహాన్ని మండల ప్రత్యేకాధికారి ఎ.కుమార్ ఆద్వర్యంలో అధికారులు గురువారం అడ్డుకున్నారు. తూర్పుగంగవరం జడ్పీహైస్కూల్ను విజిట్ చేస్తున్న సమయంలో ఓవిద్యార్థి అధికారుల వద్దకు వచ్చి 9వ తరగతి చదువుతున్న సోమవర్పాడు చెందిన ఎస్సీ కాలనీ బాలికకు వివాహం చేస్తున్నారని చెప్పారు.
ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్ప-2026ను ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని గుంటూరు జోన్ విద్యాశాఖ ఆర్జేడీ జే పద్మ అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలను గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు.
పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని విమర్శించే అర్హత యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్కు లేదని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు అన్నారు. ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడారు.
నూతనంగా జిల్లా కేంద్రం కానున్న మార్కాపురం రైల్వే స్టేషన్లో సమస్యలు తిష్ట వేశాయి. నిత్యం శ్రీశైలం వెళ్లే భక్తులకు మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. పండుగ సమయాలలో ముఖ్యంగా కార్తీక మాసం, ఉగాది, శివరాత్రి పర్వదినాలలో రద్దీ చాలా ఎక్కువ. మార్కాపురం రైల్వే స్టేషన్లో సౌకర్యాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
దోర్నాల మండల ప్రజలు ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కలెక్టర్ పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కూటమి నాయకులు స్వాగతిస్తున్నారు.
గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.
మెప్మాలో అక్రమాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. అమాయక పొదుపు సభ్యులను పావులుగా వాడుకొని ఇష్టారాజ్యంగా గ్రూపులు తయారు చేసి, బ్యాంకులలో భారీగా రుణాలు పొందిన ఆర్పీల వ్యవహారం తవ్వేకొద్దీ వెలుగు చూస్తోంది. తాజాగా మరో ఆర్పీ పీడీసీసీ బ్యాంకు టౌన్ బ్రాంచ్లో చేసిన బోగస్ బాగోతం బహిర్గతమైంది.