మొంథా తుఫాన్ కారణంగా వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఏర్పడిన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. నిర్మాణ పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఒకటికి రెండుసార్లు వెంటవెంటనే పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు.
రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి.
పది ఎకరాల తన భూమిని ఆన్లైన్ చేయాలని కోరుతూ ఐదేళ్లుగా ముగ్గురు ఆర్డీవోలు, తొమ్మిది మంది తహసీల్దార్లకు 100 అర్జీలు ఇచ్చినా పట్టించుకోకుండా తిప్పుకుంటున్నారని వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్లోని స్పందన హాలులో సోమవారం జరిగిన మీకోసంలో జేసీని మర్రిపూడి మండలం అయ్యప్పరాజుపాలెం గ్రామానికి చెందిన వడ్డెమాని శింగయ్య వేడుకున్నారు.
విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఉత్తమ ఫలితాలనిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు ముందుకువచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో 614 ఎంవోయూలు చేసుకున్నాయని వెల్లడించారు.
ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ టంగుటూరి రామాంజి చెక్ పవర్ను తాత్కాలికంగా రద్దుచేస్తూ డీపీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
చీరాల మున్సిపల్ పరిధిలోని దండుబాట రోడ్డులో వ్యర్ధ జలాలు, మురుగు నిల్వలతో ప్రజలు విలవిల్లాడు తున్నారు.
మండలంలోని నక్కబొక్కలపాడులో ఉన్న హనుమాన్సాయి మందిర 19వ వార్షికో త్సవం సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
చీమకుర్తి పట్టణంలో సాక్షిరామలింగేశ్వరాలయలో కార్తీక సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఎర్రగొండపాలెం మోడల్ డిగ్రీ కాలేజీలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర నైపుణ్యాబివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఇన్చార్జి గూ డూరి ఎరిక్షన్బాబు సోమవారం తెలిపారు.
మార్కాపురం శాసనసభ్యులు కం దుల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. అర్థరాత్రి నుంచి ఎమ్మె ల్యే గృహంలో కోలాహలం నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, కేకులు కట్ చేయించారు.