సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సులభతరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. సంపూర్ణత అభియాన్ కింద యాస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం బంగారు పతకం సాధించడం పట్ల భాగస్వాములైన వారికి ప్రత్యేకంగా అభినందన కార్యక్రమాన్ని జిల్లా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జీజీహెచ్ ఆడిటోరియంలో నిర్వహించారు.
రాష్ట్ర జలవ నరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మంగళవారం రాత్రికి దోర్నాల చేరుకుని బుధవారం ఉదయం ప్రాజెక్టు పనులు పరిశీలించడంతోపాటు అధికారులు, పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష చేస్తారు.
టీచర్స్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్) బుధవారం నుంచి ఈనెల 21వతేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లాలో ఆశా వర్కర్లుగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టరేట్లోని వైద్యశాఖ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్వో డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.
ఒంగోలు మండలం గుండాయపాలెం గ్రామ సర్పంచ్ రేవు సౌజన్య రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆమోదించారు. ఇటీవల సర్పంచ్ పదవికి ఆమె రాజీనామా చేయడంతో దానిపై క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ చేశారు.
అద్దంకి సీహెచ్సీలో ఏఆర్టీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీ.అంకినీడు ప్రసాద్ అన్నారు.
జిల్లాలో సాగర్ నీటి పంపిణీ ఈసారి గందరగోళంగా మారింది. సాగర్ డ్యామ్ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆపదలో ఉన్నాడని పాపం తలచి ఫోన్ ఇస్తే అకౌంట్లలోని నగదును కాజేసే వినూత్న సైబర్ నేరాలకు పాల్పడేవారు తారసపడుతున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారు కీప్యాడ్ ఫోన్లు వాడుతుంటారు.
జిల్లాలో స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.
అద్దంకి పట్టణంలోని నామ్ రోడ్డుపై కొంత మేర ట్రాఫిక్ రద్ధీని తగ్గించేందుకు అద్దంకి మేజర్ కాలువ కట్టను మినీ బైపాస్గా మార్చే పనులకు అడుగులు ముందుకు పడుతున్నా యి.