fisherman dead సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొమర రాజయ్య శనివారం సముద్రంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు.
road works devolopment రాష్ట్రంలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా గోతులు లేని రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో రహదారులన్నీ గుంతలు లేని రోడ్లుగా మార్చాలి. మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాల’ని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
low temparatures జిల్లావాసులను చలి వణికించేస్తోంది. మరోవైపు పొగమంచు కమ్మేస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో రాత్రివేళ 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
How about hunting సముద్రంలో చేపలు దొరికేచోట వేట సాగించొద్దని పోర్టు అధికారులు ఆంక్షలు విధిస్తే తాము ఎలా బతికేదని పలువురు మత్స్యకారులు నిలదీశారు. శుక్రవారం భావనపాడులో మత్స్యకారులు, పోర్టు అధికారులతో మత్స్యశాఖ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
మండల కేంద్రం లోని బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రి (తనూజ) గురువారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందింది.
Scrub typhus లావేరు మండలం బెజ్జిపురంలో ఓ వృద్ధుడికి(64) స్క్రబ్టైఫస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ వృద్ధుడికి పది రోజుల కిందట కళ్లం వద్ద పేడపురుగు కుట్టింది. అప్పటి నుంచి తరచూ జ్వరం వచ్చి తగ్గుతుండేది. ఈ నెల 10న గ్రామానికి 104 వాహనం రాగా.. ఆ వృద్ధుడు రక్త పరీక్షలు చేయించుకున్నారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పాతపట్నం మండలం పాసిగంగుపేటకు చెందిన గేదల మరళీకృష్ణ అలియస్ మురళి ఆచూకి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
నరసన్నపేట పట్టణంలో ఒక వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించారు.
agricultural Sports competitions ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల విద్యార్థులకు అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, లిటరరీ మీట్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎస్ఎస్ఆర్ పురంలోని కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ పోటీలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ జి.రామచంద్రరావు ప్రారంభించారు.
Mulpet’ port reviews మూలపేట పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.