ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను శనివారం నుంచి పట్టణంలో అములు చేయనున్నట్టు మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మార్కెట్ వద్ద వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ గురించి వివరించారు. మునిసిపాలిటీలో 120 మైక్రాన్లకన్నా తక్కువ మందం వున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. దీంతో ఆయా కార్యాలయాలను ఇరుకైన అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించే ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్యే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య సందర్భంగా అనకాపల్లిలో జరగనున్న నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రనున ఆదేశించారు. దీంతో ఈ నెల 12న అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించి, నియమ నిబంధనల మేరకు తగు నిర్ణయం తీసుకోవాలని ముద్దాడ రవిచంద్ర తాజాగా దేవదాయ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. పూర్తి చేసిన ఫైలును ముఖ్యమంత్రి లాగిన్కు పంపాలని ఆయన ఆదేశించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను 30 నిమిషాల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్లు మూసివేసారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. కాగా జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 26,161 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అనుబంధాలయంగా అడివివరం గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరాన అటవీ మార్గాన కొలువుదీరిన భైరవస్వామికి పెద్ద సంఖ్యలో భక్తులు అమావాస్య మొక్కులు చెల్లించుకున్నారు.
పెట్రోనెట్ ఇన్ఫినిటి సిరీస్ అంధుల మహిళా క్రికెట్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు చాంపియన్గా నిలిచింది. కేరళలో శుక్రవారం జరిగిన ఫైనల్స్లో కర్ణాటక జట్టుపై 27 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకున్నది.
అరకు-పాడేరు జాతీయ రహదారిపై నారింజవలస గ్రామ సమీపంలో చినవంతెన వద్ద డివైడర్ను స్కూటీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లాలో శనివారం నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి ఒకటి 20 తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.
మన్యంలో కాఫీ తోటలున్న గిరిజన రైతులకు మిరియాలు సిరులు కురుపిస్తున్నాయి. కాఫీ తోటలకు నీడనిచ్చేందుకు ఉండే పొడుగాటి సిల్వర్ ఓక్ చెట్లకు మిరియాలు పాదులు అల్లుకుంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టన బడ్జెట్లో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో గిరిజన సంక్షేమ శాఖకు రూ.8,159 కోట్లు కేటాయించింది.