గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, గోవాడ షుగర్స్ను ఆదుకుంటామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం శోచనీయమని అన్నారు. వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు ఆధారపడిన గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తు గురించి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
జిల్లాలో రబీ వ్యవసాయ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది రబీలో అన్ని రకాల పంటలు కలిపి 15,630 హెక్టార్లులో సాగు అయ్యే అవకాశం వుందని అంచనా వేశారు. ఇందులో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి పంట వుండే అవకాశం వుంది.
మండలంలోని రత్నాయమ్మపేటలో సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ముద్దాయికి పదేళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ విశాఖలోని పోక్సో కోర్టు ముద్దాయికి తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి సీఐ జి.అప్పన్న తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలో వంట్లమామిడి గ్రామానికి చెందిన అంధుల క్రికెటర్ పాంగి కరుణకుమారికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు.
జిల్లాలోని ఘాట్ మార్గాల్లో ప్రయాణాలంటే ప్రజలకు గుబులు పడుతోంది. శుక్రవారం ఉదయం మారేడుమిల్లి ఘాట్లో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 17 మంది ప్రయాణికులు గాయపడిన ఘటనతో మన్యం వాసులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఘాట్ మార్గాల్లో ప్రమాదాలు చర్చనీయాంశమయ్యాయి.
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి పంజా విసురుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు.
అంత్యక్రియలు ఆపి వివాహిత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన సంఘటన మండల కేంద్రం డుంబ్రిగుడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
కాఫీ గింజలకు జీసీసీ అంతర్జాతీయ ధరలు అందిస్తుందని గిరిజన సహకార సంస్థ స్థానిక డివిజనల్ మేనేజర్(డీఎం) డి. సింహాచలం అన్నారు.
విశాఖపట్నంలోని కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. ముందుగా 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగ్నిజెంట్లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు.