Ambedkar's inspiration should rise to the highest level విద్య ద్వారానే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునని చెప్పడానికి మహనీయుడు అంబేడ్కర్ జీవితం ఉదాహరణ అని, చిన్న కుగ్రామంలో పేదింట జన్మించిన అంబేడ్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజల జేజేలు అందుకుంటున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
TDP's hand once 4 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 24 బ్రాంచ్లు, 9 ఏటీఎం కేంద్రాలు, మూడు మొబైల్ ఏటీఎంలు, 1.30 లక్షల మంది సభ్యులు, రూ.1,750 కోట్ల లావాదేవీలు’.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు స్వరూపం.
Festivity in the hill regions జిల్లాలోని గిరిసీమల్లో సందడి మొదలైంది. ఇటుక పండగ ప్రారంభమైంది. ఉగాది (చైత్రోత్సవాలు) ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుం టున్నారు.
Even before the beginning గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లోపిస్తోంది. దీంతో రోడ్డు నిర్మాణాలు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Another 110 people సీతంపేట ఐటీడీఏ పరిధిలో కొత్తగా 110 మంది సికిల్సెల్ అనీమియా బాధితులు ఎన్టీఆర్ భరోసా పింఛన్కు అర్హత సాధించారు. బాధితులకు ఈ ఏడాది జూన్ నుంచి రూ.10వేల చొప్పున ప్రతినెలా పింఛన్ అందే అవకాశం ఉంది.
Efforts Toward Realizing Ambedkar's Vision రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మండలంలోని కొండగండ్రేడు జిల్లా పరిషత్ పాఠశాల గదుల నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. దీంతో విద్యార్థులకు అగచాట్లు తప్పడం లేదు.
:గజపతినగరం, పురిటిపెంట పంచాయతీల్లో ఆశీలునిర్వహణ గాడితప్పుతోంది.ప్రధానంగా పాట దారులు బకాయిలు చెల్లించకపోవడంతో పంచాయతీల ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆశీలు నిర్వాహకులు రసీదులు ఇవ్వ డంలేదని వ్యాపారులు వాపోతున్నారు.
పేస్కేల్ అమలు చేయాలని, కనీసం 26 వేల వేతనం ఇవ్వాలని వీఆర్ఏలు కోరారు.ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని వీఆర్ఏలు సోమవారం చీపురుపల్లిలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
విజయనగరంలోని సిటీక్లబ్ వేదికగా పదేళ్ల విరామం తర్వాత నిర్వహించిన లాన్ టెన్నిస్ పోటీలు సోమవారం ముగిశాయి. రెండురోజుల పాటు సింగిల్స్, డబుల్స్ విభాగంలో జరిగిన ఈ పోటీలకు సంబంధించి అండర్-12, అండర్-16, 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా 62 మంది పాల్గొన్నారు.