why the situatiobn is bad నగరానికి తలమానికమైన పెద్దచెరువు దుర్గంధం వెదజల్లుతోంది. నిన్నటివరకూ ఎంతో ఆహ్లాదకరంగా, పర్యాటకులకు ఆటవిడుపుగా ఉన్న పెద్దచెరువు నేడు కంపుకొడుతోంది. మృత చేపలు అధికంగా పేరుకుపోవడంతో అటువైపుగా వెళ్లాలంటేనే ముక్కు మూసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Still Treating It as Someone Else’s Share! జిల్లా ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల సమస్య వేధిస్తోంది. నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న దుస్థితి. ప్రతి నెలా లక్షలాది రూపాయలు అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తోంది.
worry in weaver మగ్గం నేస్తూ కొందరు.. నూలు వడుకుతూ మరికొందరు.. చరకా యంత్రం తిప్పుతూ ఇంకొందరు.. వారికి సహకరించే మరింత మంది కార్మికులతో కళగా ఉండే ఆ భవనం నేడు వెలవెలబోతోంది. కార్మికులు చెమటోడ్చి తయారు చేసిన చేనేత వస్త్రాలు ఓ చోట పేరుకుపోయాయి.
Opportunity for Registration of Inherited Agricultural Lands వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ ఫీజుల విషయంలో కూటమి ప్రభుత్వం మార్పులు తెచ్చింది. దీని ప్రకారం.. ఎకరం మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే.. ఇకపై స్టాంపు డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల పైన ఉంటే రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
100-Day Plan for 100% Results జిల్లాలో పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత మూడేళ్లు టెన్త్ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.
Procurement of Grain as per Guidelines నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. ఆదివారం కోట సీతారాంపురంలో పర్యటించారు. ముందుగా ధాన్యం నూర్పిడి జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి రైౖతులు, సిబ్బందితో మాట్లాడారు. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు.
Change the Approach ‘కొందరు మిల్లర్లు రైతుల వద్ద రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చించి. ఇది సరికాదు.. పద్ధతి మార్చుకోండి.’ అని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. నిబంధనల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.
మండలంలోని మందరాడ నుంచి గోవిందపురం పీఆర్ రోడ్డు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకో వడంలేదు. ప్రభుత్వాలు మారుతున్నా తమ రోడ్డును అభివృద్ధిచేయడం లేదని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అడుగడుగునా గుతులమయమై చిన్నపాటి వర్షానికి బురదమ యమవుతోంది.
పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అం దించడమే ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలి పారు. ఆదివారం లక్కవరపుకోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటి వద్ద ఇరవై మంది సభ్యులకు సీఎంఆర్ఎఫ్ కింద సుమారు రూ.19 లక్షల ఆర్థిక సాయం ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీచేశారు.
రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. ఆదివారం విజయనగరం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నిరంగా ల్లో రాష్ట్రం ముందుకువెళ్తోందని తెలిపారు.