మండలంలోని రుస్తుం బాదా పంచాయతీ పరిధిలో ఉన్న మండవారి గరువులో గురువారం హైటె న్షన్ నెలకొంది.
బుట్టాయగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కారం శాంతిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆర్డీవో ఎంవీ రమణ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 15 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు ఆయన తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నమూనా అసెంబ్లీలో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏడుగురు బాల ఎమ్మెల్యేలు ప్రత్యేకత, వాగ్ధాటిని కనబరిచారు.
చాన్నాళ్ల తర్వాత జిల్లా సమీక్షా కమిటీ సమా వేశం(డీఆర్సీ)లో అజెండాపై అర్థవంతమైన చర్చ సాగింది. పొరపాట్లకు తావివ్వకుండా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమ స్యలను పరిష్కారానికి మమైకమై పాటు పడుదామని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.
వీధివ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది.
మట్టి రోడ్లతో విసిగిపోయిన పల్లె ప్రజలకు తీపి కబురే ఇది. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని కూటమి సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
బుట్టాయ గూడెం వైసీపీ ఎంపీపీ కారం శాంతిపై సొంత పార్టీ నేతలే అవిశ్వాసం ప్రకటించారు. సభ్యుల నిర్ణయంతో ఆర్డీవో ఎం వి.రమణ బుధవారం మండల పరిషత్ సమావేశ మంది రంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏలూరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన మం గళవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరిగింది.
జల వనరుల శాఖలో ఇంజనీర్ల కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ కాకపోవడంలో కీలకమైన మైనర్, మేజర్ ప్రాజెక్టుల పర్యవేక్షణ కష్టతరంగా మారింది.
పెన్షన్ల కోసం అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త పెన్షన్ అవకాశం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లలో పెన్షన్ల కోసం వినతులు వస్తున్నాయి.