Home » 2024
అంతర్జాతీయ బధిరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీ బధిరుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్అండ్బీ కార్యాలయం ఆవరణంలోని ఆడిటోరియంలో కేక్కట్ చేసి సైగలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కుమార్ మాట్లాడుతూ... ప్రజలు సైగల భాషను ఆకళింపు చేసుకునేలా ప్రభుత్వం తగు సూచనలు చేయాలని కోరారు.
ఎస్జీఎఫ్-19 జిల్లా స్థాయి చెస్ క్రీడాకారులను ఎంపిక చేశారు. స్థానిక న్యూటౌన బాలుర జూనియర్ కళాశాల ఆవరణంలో ఆదివారం ఎంపిక పోటీలు నిర్వహించా రు. ఇందులో ఆదిత్యరెడ్డి, హన్ని స్టీఫెన, విశ్వనాథ్, మిస్బా, తరుణ్ విజేత లుగా నిలిచారు.
యూటీఎఫ్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపులో భా గంగా నగరంలోని శారద స్కూల్ లో మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. అంతకు ముందు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ...యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల శ్రేయస్సే పరమావధి గా పోరాటాలు చేస్తోందన్నారు.
మండల కేంద్రంలోని ఆటోనగర్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ రాత్రిళ్లు అక్కడి మెకానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్లి, అమ్ముకుంటున్నారు. రిపేరీ కోసం వచ్చిన వాహనాల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో మెకానిక్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారి పక్కన 554-2 సర్వే నెంబర్లో 33 ఎకరాల్లో ఆటో నగర్ ఉంది. ద్విచక్రవాహనం మినహా మిగతా అన్ని వాహ నాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వం వచ్చింది... మనల్ని ఎప్పుడు మారుస్తారో తెలియ దు... ఉన్నన్ని నెలల్లో ఏదో కొంత మందికి రేషన బియ్యం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా పక్కదా రి పట్టించినా పట్టించుకునేవా లేరు అన్న ధోరణి లో పలువురు రేషన డీలర్లు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల వ్యాప్తంగా 52మంది రేషన డీల ర్లు ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతోంది.
చిత్తశుద్ది లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడంతోనే కల్తీ లడ్డూ ఘటనలతో అపవి త్రాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవనకళ్యాణ్ శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మ ద్ధతుగా టీసీ వరుణ్ ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్, రాయలసీమ ప్రాంతీయ మహిళ కన్వీనర్ పెండ్యాల శ్రీలత, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావుతో కలిసి శ్రీనివాస నగర్లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహిం చారు.
విద్యార్థులు క్రీడలపై దృష్టి సారిస్తే.... సెల్ఫోన అడిక్షన దూరం అవుతుం శ్రీచైతన్య పాఠశా లల ఏజీ ఎం సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కమ్మభవన సమీపంలోని శ్రీచైత న్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం స్పోర్ట్స్ డేని ఘనంగా నిర్వహిం చారు. ఏజీఎం ముఖ్యఅతిథిగా హాజరై ఒలంపిక్ జ్యోతి వెలిగించి, స్పోర్ట్స్ డేను ప్రారంభించారు
ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడ రేషన జిల్లా స్థాయి సెలెక్షన్సలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ న్యూ టౌన బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో సెపక్తక్రా, మోడరన పెంతలాన, ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవజ్యోతి భగతసింగ్ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహా నికి శనివారం నాయకులు క్షీరాభిషేకం చేశారు.
ఖరీ్ఫలో వేరుశనగ సాగు చేసిన రైతులను నష్టాల భయం వెంటాడుతోంది. వర్షాభావం కారణంగా పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల్లో పదును వర్షం కురవకపోతే పశుగ్రాసం కూడా దక్కదని అంటున్నారు. రాప్తాడు మండల వ్యాప్తంగా 33 వేల ఎకరాల సాగు భూమి ఉంది. జూన, జూలైలో కురిసిన వర్షాలకు, బోరు బావుల కింద 4,350 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. వర్షాధారం కింద సాగు ...