Home » 2024
కలెక్టరేట్ సమీపంలోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయం కబ్జాకు గురవుతోంది. నగరంలోకి ప్రవేశించే కదిరి బైపాస్, జేఎనటీయూ రోడ్డు కలిసే వై జంక్షనలో ఉన్న కార్యాలయం కనిపించకుండా కొందరు పాగావేశారు. కార్యాలయం ముందు దుకాణాలను ఏర్పాటు చేసి.. రోడ్డు వరకు విస్తరించారు. దీంతో కార్యాలయ బోర్డు, ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం కనుమరుగయ్యాయి. వైసీపీ హ యాంలో ఈ కబ్జాల పర్వం
రైతుల ఉద్యమాలు.. రెజ్లర్ల ఆందోళనలతో తరచూ వార్తల్లో నిలిచిన హరియాణాలో అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ప్రధాన కార్య దర్శి కుళ్లాయిస్వామి ఆధ్వర్యంలో బుధవారం తరగతులు నడుపుతున్న పులు కార్పొరేట్ కళాశాలల వద్దకు వెళ్లి, నిరసన తెలిపారు. తరగతు లను బంద్ చేయించారు.
కలియుగదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్స వాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివార ్లకు విశేష పూజలు నిర్వహించారు. అంకురార్పణ, పవిత్ర గరుడ పతా కావిష్కరణ, అమ్మవార్లు స్వామి మూలవిరాట్లకు వివిధ అభిషేకా లు, కుంకుమార్చనలు, తోమాలసేవ, అలంకారసేవ నిర్వహించారు.
మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ దురు గాలి, వడగండ్లవాన బీభత్సం సృష్టించాయి. వాటి ధాటికి పలు పంట లు దెబ్బతినడంతో రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రేకుల దుకా ణాలు, షెడ్లు, విద్యుతస్తంభాలు పలు చెట్లు నేలకొరిగాయి. సీకేపల్లి జాతీయ రహ దారి పక్కన గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాధాక్రిష్ణ ఏర్పాటు చేసు కున్న రేకుల దుకాణాలు తీవ్రమైన గాలుల ధాటికి రహదారి అవతల ఉన్న లేఔట్లలోకి ఎగిసిపడ్డాయి.
మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాల యం ఆవరణలో ఉన్న శారదా శంకరాచార్యుల దేవాల యంలో వేడుకల ప్రారంభం సందర్భంగా ఉదయాన్నే కలశపూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీక్షా బంధనం గావించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవ మూర్తిని హంసవాహనంపై ఆశీనుల నుచేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీని... మహిళలు, ప్రజల మానప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఉపసంహ రించుకోవాలని మహిళా సంఘాల జేఏసీ నాయకురాలు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి డిమాం డ్ చేశారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం క్లాక్టవర్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక అశోక్నగర్లోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. స్వచ్ఛతాహి సేవా ప్రాధాన్యతపై సభ్యులు, క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు.
స్థానిక జిల్లా ట్రాన్సపోర్ట్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఇందులో భాగంగా జిల్లా ట్రాన్సపోర్టు అధికారి వీర్రాజు, ఆర్టీఓ సుధాకర్ నాయుడు, ఎంవీఐలు శ్రీనివాసులు, శ్వేత బిందు, ప్రసాద్, పరిపాలన అధికా రి కామరాజు తదితరులు కార్యాలయ పరిసరాల్లో చెత్తను తొలగించారు.
సత్యం, అహింసే ఆయుధంగా ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మగాంధీ 155వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జాతిపితకు ఘన నివాళి అర్పించారు. నగరంలోని గాంధీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.