Home » Arrest
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
మంగళగిరి(Mangalagiri) టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా... తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella AppiReddy) అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బి నాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను బెదిరించి, కొట్టించి రూ.250కోట్ల విలువైన సంస్థను రాయించుకునే ప్రయత్నం చేసినట్లు బాఽధితుడు చెన్నుపాటి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మహిళపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యవహారంలోఉత్తర చెన్నై బీజేపీ కార్యదర్శి సెంథిల్(Chennai BJP Secretary Senthil)ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కొరుక్కుపేట నేతాజీ నగర్కు చెందిన రామరాజన్ భార్య నవమణి కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.
వారిద్దరూ ఓ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థలో పని చేస్తున్నారు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆ మహిళ కొద్దిరోజులుగా మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని ఘర్షణ పడుతున్నాడు. వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. మహిళను దారుణంగా హత్య చేశాడు.
బాపట్ల జిల్లాలో ఓ బాలికపై ఐదుగురు సామూహిక అత్యా చారానికి పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.
ఒంటరిగా ఉన్న మహిళలకు డబ్బు ఆశచూపి శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత వారి ప్రాణాలు తీస్తున్న ఓ కరడుగట్టిన హంతకుడిని మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పోలీసులు పట్టుకున్నారు. సదరు యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు హత్యలు చేశాడు.
కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్(Bank Manager) పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంక్నే మోసం చేసి కోట్లాది రూపాయలను తన సొంత అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ కేసులో నాలుగు నెలల అనంతరం అతడిని బుధవారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.