Home » Awards
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది.
స్టార్ ఆస్పత్రికి చెందిన డా.లోకేశ్వరరావు సజ్జాకు వైద్య పరిశోధనలో చేసిన కృషికి 2024 సంవత్సరానికి బ్లాక్బక్ అవార్డు(బ్లాక్బక్ పయనీర్ రీసెర్చర్ అవార్డు) దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.
సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకున్నారు.
కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
జాతీయస్థాయిలో ఉత్తమ పాత్రికేయులకు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు దివంగత రామోజీరావు పేరిట ఏటా స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఏపీ టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
విద్యా, ఆరోగ్యం, పర్యావరణ రంగాల్లో చేసిన విశేష కృషికిగాను శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీకి ప్రతిష్ఠాత్మక ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు లభించింది. గురువారం లండన్లోని గిల్ట్హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషి్పను ప్రదానం చేసిం ది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్య క్షుడు మాధవ్ కౌశిక్, కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు శనివారం ముస్సోరిలో రస్కిన్ బాండ్ నివాసానికి వెళ్లి ఈ ఫెలోషి్పను అందజేశారు.