Home » Districts
వందలాది మంది ఉద్యోగుల మెడపై జగన ప్రభుత్వం, సమగ్రశిక్ష అధికారులు కత్తి పెట్టారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే ఒక రోజు బ్రేక్ ఇచ్చి.. ఆ ఏడాది కాలానికి ఉద్యోగుల కాంట్రాక్టును రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది 40 రోజులకు మాత్రమే రెన్యువల్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి...? కొనసాగిస్తారా..? ఉద్వాసన పలుకుతారా..? తేలాల్సి ఉంది. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జగన ప్రభుత్వ నిర్ణయంపై కేజీబీవీ ఉద్యోగులు మండిపడుతున్నారు....
గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు అల్లాడుతున్నారు. వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలరోజుల నుంచి చుక్క నీరు అందుబాటులో లేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. రోగులు నీటిని బయట కొనాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వో ప్లాంట్ ద్వారా మెడికల్, లేబర్ వార్డుల వద్ద తాగునీటి సౌకర్యం ...
తనది మైనార్టీల ప్రభుత్వమని మోసం చేసిన జగనను ముస్లిం సమాజం ఇక ఎన్నటికీ నమ్మదని శాసన మండలి మాజీ చైర్మన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ జగన హయాంలో రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని, 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ కూటమిలో ...
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి అయ్యింది. మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత అర్బనకు అప్పటి విపక్ష నేత వైఎస్ జగన, నాటి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అలివిగాని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. నగర రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చిన అనంత వెంకటరామిరెడ్డి.. నిజంగానే మాట నిలబెట్టుకున్నారు. అనంత రూపురేఖలను బళ్లారి బైపాస్ నుంచి పంగళ్ రోడ్డు వరకూ ప్రతిష్టాత్మక రోడ్డును ‘వంకర’గా మార్చేశారు. అప్పట్లో ‘సుందర అనంత-మన అనంత’ పేరుతో ...
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి.. మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరూక్ సిబ్లి.. ముస్లింలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని సత్యసాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. నూర్బాషాల సంఘం అభివృద్ధికి మేనిఫెస్టోలో....
పింఛన్ల పంపిణీలో రాజకీయాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. బ్యాంకు ఖాతాలలో జమచేస్తామని చెప్పడం లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమేనని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో సొమ్ము జమ అయిందో లేదో తెలుసుకోవడం, బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేసుకోవడం దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందికరం. ఎండలు మండిపోతున్న తరుణంగా బ్యాంకులకు వెళ్లడం వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జిల్లా వ్యాప్తంగా 663 గ్రామ, వార్డు సచివాలయాలలో...
అధికారం చేతిలో ఉన్నా సొంతూరి చుట్టు పట్ల గ్రామాలకు తారురోడ్డు వేయించుకోలేకపోయాడనే విమర్శలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్షరెడ్డి మూటగట్టుకున్నాడు. ఆత్మకూరు మండలంలో బి. యాలేరు నుంచి తగరకుంట వరకూ డబుల్లేన తారు రోడ్డు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ఆ పనులు అరకొరగా చేశారు. కల్వర్టుల...
వజ్రకరూరులో జనార్దన వేంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని పురష్కరించుకునిగాడిదల పరుగు పోటీలను సోమవారం నిర్వహించారు. రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పోటీలో ఎనిమిది గాడిదలు పాల్గొనగా, మురిడికి చెందిన తిప్పేస్వామి ..
: రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల గుర్తింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలిసింది. విందులో పాల్గొన్నవారంతా అనంతపురం అర్బన, రూరల్ ప్రాంత ఉపాధ్యాయులేనని సమాచారం. వీరిలో అధికశాతం మంది అనంతపురం అర్బన ఓటర్లు. ఎక్కువశాతం వైసీపీ మద్దతుదారులు. గత నెల 31న ఈ రాజకీయ విందు జరిగింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉల్లంఘనలపై నిజాయితీగా విచారిస్తున్న అధికారులకు ...
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముగ్గురు వలంటీర్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం వేటు వేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హుళికేర గ్రామ వలంటీరు ఎస్.సురేష్, డీ.హీరేహాళ్ మండలం సోమలాపురం గ్రామ వలంటీరు ..