Home » Districts
సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్కు మనం ఎంత చెబితే అంత..’ ...
తన కుమారుడి చేత పాలిసెట్ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్ఎ్సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..
ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం వైఎస్ జగన తాడిపత్రికి ఆదివారం వస్తున్నారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పుట్లూరు రోడ్డులోని కర్నూలు వెంచర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వైఎస్సార్ సర్కిల్కు చేరుకుంటారు. 10:15 గంటలకు సభలో..
ప్రజలంతా ఏకమై వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ కోరారు. శ్రీనగర్ కాలనీలోని పార్టీ అర్బన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్యతో కలిసి శుక్రవారం జగన ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో చార్జ్ షీట్ను ఆవిష్కరించారు. సీఎం జగన మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని అన్నారు. గత ...
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత, పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడులో టీడీపీ కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత గురువారం నామినేషన దాఖలు చేశారు. తమ స్వగ్రామం వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్దార్థ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎల్లమ్మ అలయంలో, పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద పూజలు ..
మండలంలోని మేడాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన చీనీతోటకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. రైతు పసల రత్నమ్మ, టీడీపీ కార్యకర్తలైన ఆమె కుమారులు తెలిపిన మేరకు...గ్రామ సమీపంలో రెండెకరాల పొలంలో దాదాపు 15 ఏళ్లుగా 450 చీనీ చెట్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందని రైతు రత్మమ్మ తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో తోటకు ...
గుత్తిఆర్ఎస్లో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మూడు నెలలుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో గుత్తి ఆర్ఎస్లోని ఏడో వార్డు మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ డౌన డౌన అంటూ నినాదాలు చేశారు. మూడు నెలలుగా కొళాయిలకు...
నామినేషన్లకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ స్థాయిలో నామినేషన్లు పడ్డాయి. ఎంపీ స్థానానికి నాలుగు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ, కాంగ్రెస్ తరఫున మల్లికార్జున, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి పార్టీ తరఫున నల్లాని రమేష్నాయుడు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన వేశారు. నామినేషన్లు వేసేందుకు గురువారం ఆఖరి రోజు. చివరి రోజున కూడా భారీగా....
నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు జోరు పెంచారు. అనంతపురం ఎంపీ స్థానానికి మంగళవారం ఒకరు నామినేషన వేశారు. బీఎస్పీ అభ్యర్థి బి.నారాయణప్ప, ఎస్పీ అభ్యర్థి నిజామ్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్కు నామినేషన పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో అనంతపురం అర్బనలో 14, రాప్తాడులో 08, ఉరవకొండలో 07, గుంతకల్లులో 03, కళ్యాణదుర్గంలో 06, రాయదుర్గంలో 05, తాడిపత్రి 2, శింగనమలలో ఐదు నామినేషనలు దాఖలయ్యాయి.
మండలాల్లో పాదయాత్ర చేయడంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. పాదయాత్ర సందర్భంగా యాడికి, పెద్దవడుగూరు మండలాలకు జగన ఎన్నో ఆశలు కల్పించారు. ముఖ్యంగా యాడికి కాలువకు నీళ్లు వచ్చేలా చేస్తామని ఇచ్చిన హామీ ట్రయల్రనకే పరిమితమైంది. అదే విధంగా యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా అవీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఆ రెండు మండలాల ప్రజలు జగన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -