Home » GHMC
Hyderabad: సెల్లార్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ ఘటనలో హైదరాబాద్లోని ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీహార్ చెందిన కార్మికులు మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్బోర్డు అధికారులు(Waterboard officials) హెచ్చరిస్తున్నారు. వారి నల్లా కనెక్షన్ నంబర్పై మాత్రమే బుక్ చేసుకోవాలని.. ఒకరి కనెక్షన్ నంబర్(Connection number)ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎమ్సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తృటిలో ప్రమాదం తప్పింది. ఫుట్పాత్పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు.
వేసవి ఇంకా రాలేదు కానీ ఉదయం వేడి... రాత్రి చలితో ప్రజలు వణుకుతున్నారు. తాగునీటికి అప్పుడే డిమాండ్ అధికమవుతోంది. సహజంగా ఏప్రిల్, మేలో నీటికి డిమాండ్ పెరగడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది.
గ్రేటర్(Greater)లో రోడ్లపై చెత్త కుప్పలు కనిపించకుండా మరో ప్రయోగానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా పలు సర్కిళ్లలో స్మార్ట్ బిన్లు ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ ఇలంబరిది(Commissioner Ilambaridi) తెలిపారు.
నిరసనలు, వాయిదాలతో గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్ కు చెందిన సభ్యులందరినీ కౌన్సిల్ నుంచి బయట కు పంపించారు.
GHMC Council Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే గందగోళపరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగట్లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు పట్టుకుని కౌన్సిల్ మీటింగ్కు వచ్చారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.
GHMC Council Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం ప్రారంభంకానుంది. బీజేపీ, బీఆర్ఎస్ కార్పేరేటర్లు మేయర్ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. కమలం పార్టీ నేతలు వినూత్న రీతిలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road) పరిధిలో వాటర్బోర్డు తాగునీటి సరఫరా చేస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలతో పాటు జంట జలాశయాల నీళ్లు తీసుకొచ్చి నగరవాసులకు సరఫరా చేస్తోంది.
హైదరాబాద్ మహా నగరానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు(Krishna waters) బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్స్టేషన్లోని 132 కేవీ బల్క్ లోడ్ ఫీడర్ పీటీ మరమ్మతులకు గురైంది.