Home » kaleshwaram
కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈఎన్సీ జనరల్ అనిల్కుమార్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ శనివారం సందర్శించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్కు సాంకేతిక అంశాల్లో సాయమందించేందుకు ఈ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీను నిపుణుల కమిటీ సందర్శించనుంది. నిర్మాణపరంగా, నాణ్యత పరంగా, నిర్వహణ పరంగా లోపాలను వెలికితీయడంతో పాటు వాటికి బాధ్యులను గుర్తించేందుకు నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు సాంకేతిక అంశాల్లో సాయం కోసం వేసిన ఈ కమిటీ శనివారం ఆయా బ్యారేజీలను సందర్శించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram project) జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Chandraghosh) నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ న్యాయవిచారణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే జూన్ 6వ తేదీకి కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర గోష్ హైదరాబాద్ వస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు నడుస్తుండగా.. దిగువన షీట్ పైల్స్ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆర్క్ గ్రౌగింగ్ పద్ధతిలో 20వ నెంబరు గేటు తొలగింపు పనులు నిర్వహిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్-7 కింద అగాధాన్ని పూడ్చేందుకు గ్రౌటింగ్ పనుల ప్రారంభానికి మరోరోజు సమయం పట్టనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకుగాను భూ భౌతిక (జియో ఫిజికల్), భూ సాంకేతిక (జియో టెక్నికల్) పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్సఎంఆర్ఎస్) నిపుణుల బృందం రానుంది.
మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్-7కు దిగువన షీట్ఫైల్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం బ్లాక్-7కు దిగువన ఉన్న ఒక వరుస సీసీ బ్లాక్లను తొలగించడంతో పాటు వరద ఉధృతికి చెల్లాచెదురైన సీసీ బ్లాక్లను తిరిగి అమరుస్తున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది.