Home » Lalu prasad yadav
రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.
లోక్సభ ఎన్నికల్లో పొత్తులతో కాంగ్రెస్లో టికెట్లు దక్కని నేతలతొ ఆ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొంమతంది నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతుంటే.. మరికొందరు నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.
బీహార్లో కూటమి సీట్ల లెక్క తేలడం లేదు. భాగస్వామ్య పక్షాల మధ్య ఒప్పందం కొలిక్కి రాకముందే రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థులను ప్రకటించింది. కొందరికి టికెట్లను కూడా అందజేసింది. దీంతో అక్కడ కూటమి పోటీ చేసే స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతలో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆఫర్ ఇచ్చారు.
లాలు ప్రసాద్ యాదవ్ మరో కూతురు రోహిణి ఆచార్య లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తోంది. లాలు కుటుంబానికి కంచుకోట అయిన సరన్ లోక్ సభ నుంచి ఆర్జేడీ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రస్తుతం లాలు కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, పెద్ద కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. పాట్నాలో గల రాజేంద్ర నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి తేజ్ ప్రతాప్ యాదవ్కు చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని మోదీకి కుటుంబం లేదని, పిల్లలు లేరని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వరసగా లాలు ప్రసాద్ యాదవ్కు కౌంటర్ ఇస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దాణా దొంగ అయిన లాలు ప్రసాద్ యాదవ్కు మోదీని విమర్శించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి కుటుంబం లేదు, పిల్లలు లేరని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువు కాదని, తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదని అన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోదీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.