Home » Mancherial district
నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రైలు మంగళవారం మినహా రోజూ నడువనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వందేభారత్ రైలు సేవలు విశాఖ ప ట్నం-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య నడుస్తున్నాయి.
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగండం సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ వారం మంచిర్యాల, లక్షెట్టిపేట పలు ప్రాంతాల్లో నిమజ్జనం, శోభాయాత్ర నిర్వ హించే ప్రదేశాలను పరిశీలించారు.
సికింద్రాబాద్ నుంచి నాగపూర్ నడిచే వందేభారత్ రైలును మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే స్టేషన్లో చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ఆందోళన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వారికి మద్దతు తెలిపారు. చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, ఇరుకుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మం చిర్యాల రైల్వే స్టేషన్ ఏ గ్రేడ్ అయినప్పటికి ఇక్కడ ప్రధాన రైళ్లు నిలపక పోవడంతో వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ కుమార్దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. సోమవారం వెల్గనూర్ గ్రా మాన్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సం దర్శించారు.
మండల కేంద్రంలో ఉన్న గొల్లవాగు ప్రాజెక్టు పర్యా టకులను ఆకర్షిస్తుంది. మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో గొల్లవాగు ప్రాజెక్టును 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంతో జల వనరులు పెరిగి వ్యవసాయ మండ లంగా పేరుగాంచింది. వర్షాకాలంలో సం దర్శకుల తాకిడితో గొల్లవాగు ప్రాజెక్టు నిత్యం ప్రజలతో కళకళాడుతుంది.
ఆదర్శ పాఠశా లల్లో ఉపాధ్యాయుల బదిలీల కల ఎట్టకేలకు సాకారమైంది. బదిలీల కోసం పుష్కర కాలంగా ఎదురు చూస్తుండగా కోర్టు, ప్రభుత్వం చొరవతో మోక్షం లభించినట్లయింది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను ఆంగ్ల మాద్య మంలో అందించే లక్ష్యంతో 2012లో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది.
గ్రామ పంచాయతీ సాధారణ ఓటరు జాబితా నమోదు ప్రక్రి యను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవ హరించే బీఎల్వోలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం దేవాపూర్ గ్రామపంచాయతీలో కలెక్టర్ పర్యటించారు.
బీజేపీ బలోపేతానికి యువతతోపాటు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీనియర్ నాయకుడు శ్యాంసుందర్రావు అన్నారు. శనివారం పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసించారని, అన్ని వర్గాల ప్రజలు యువత సభ్యత్వం తీసుకోవాలన్నారు.
దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో పాముకాటుతో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఆరుగురు సెక్యూరిటీ గార్డులు బ్యారక్కు చేరుకొని నిద్రలోకి జారు కున్నారు.
లక్షెట్టిపేట పట్టణ, మండలంలోని చెరువ ులు కుంటలను కబ్జాదా రుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ పీడీ ఎస్యూ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.