Home » Mancherial
సమస్యలను పరి ష్కరించడానికే గ్రామాల్లో పర్యటిస్తున్నానని ఎమ్మె ల్యే వివేక్వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఇందారంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉం టున్నాయని సమస్యను పరిష్కరించాలని ఎమ్మె ల్యేకు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూ రుకు సంబంధించి పది రోజుల్లో విధివిధానాలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న గూడు లేని నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహిళల అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాలక్ష్మీ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెర వేరుస్తున్నారన్నారు.
విద్యార్థి దశలో వ్యర్థాలకు అర్ధవంతమైన రూపం తీసుకుని పునర్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శుక్రవారం జిల్లా సైన్స్ కేంద్రంలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో వ్యర్ధం నుంచి అర్ధం అనే అం శంపై నిర్వహించిన ఆర్ట్, క్రాప్ట్ ఎగ్జిబిషన్ను డీఈవో యాదయ్యతో కలిసి పారరంభించారు.
మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలి యన్ను శుక్రవారం రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్ల అదనపు డీజీపీ సం జయ్కుమార్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెటాలియన్కు వచ్చిన ఆయనకు రామగుండం సీపీ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్లో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్వీరు, లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు.
మహానీయులు చూపిన మార్గం అందరికి ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహిం చారు. కలెక్టర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లాలో ధాన్యం రవాణా చేసే లారీల టెండర్లు ఈసారైనా జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రతిసారీ ధాన్యం రవాణాకు లారీలకు టెండర్లు ఆహ్వానించడం అనంతరం నేరుగా పనులు అప్పగించడం జిల్లాలో కొన్నాళ్లుగా ఆనవాయి తీగా వస్తోంది.
క్రైం రేటును తగ్గించే విధంగా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీని వాస్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
తెలంగాణ సా యుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. గురు వారం చాకలి ఐలమ్మ జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.