Home » tihar jail
జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరణానికి చేరువ చేసే చర్యలు జరుగుతున్నాయని ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. తమ నాయకుడు కేజ్రీవాల్ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు జైలు అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
లిక్కర్ స్కామ్లో అరెస్టై తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు. జైలులో తనను ఎక్కువగా టార్గెట్ చేశారని, 24 గంటల పాటు నిఘా ఉంచారని, రోజువారి కార్యకలపాలు, సమావేశాలపై కూడా దృష్టిసారించారని మండిపడ్డారు.
తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ను కరడుగట్టిన క్రిమినల్స్ కంటే దారుణంగా చూస్తున్నారని, ఒక గ్లాస్ వాల్ గుండా ఫోనులో ఆయన తనతో మాట్లాడారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు.
లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ను జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వచ్చారు. కేజ్రీవాల్ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్టు చేసింది. శుక్రవారం మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చక్కటి ఆరోగ్యంతో ఉన్నట్టు జైలు వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలను అధికారులు తోసిపుచ్చారు.
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గిపోయారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలను జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ బరువు యధాతథంగా 65 కిలోలు ఉందని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 21 అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోలు తగ్గారని అన్నారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్