Home » Telangana » Hyderabad
హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఐదుగురి ప్రాణాలు కాపాడటానికి 16 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు.
Telangana: ఆగష్టు 15లోగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమంటూ గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మాజీ మంత్రి హరీష్రావు రాజీనామా లేఖను ఉంచారు. ఆ తరువాత అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్... అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో చిన్న ఎమ్మేల్యే అని, ఆయన స్వేచ్ఛగా అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చారంటే ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చినట్లు అర్థమని అన్నారు.
Telangana: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్కు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీష్రావుత గన్పార్క్ వద్దకు రావడంపై సీఎం స్పందిస్తూ... హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నారని..
Telangana: రైతు రుణమాఫీ అంశం ముఖ్యమంత్రికి, మాజీ మంత్రి మధ్య పెను తుఫానునే సృష్టిస్తోంది. రుణమాఫీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అంటూ హరీష్ సవాల్ విసరడం.. అయితే రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగు అని సీఎం రేవంత్ రెడ్డి అనడం..
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తూ రాజీనామా లేఖతో ఆయన అమర వీరుల స్తూపం వద్దకు వస్తున్నారు.
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
TSRTC - Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు(TSRTC) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణుకుల సౌకర్యార్థం మెట్రో ట్రైన్ టైమింగ్స్.. బస్సులు(Buses) నడిపే సమయాన్ని పెంచారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్(IPL 2024) సీజన్ 17లో భాగంగా..