Home » Telangana » Karimnagar
గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీబీ ఛాంపియన్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారం భించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో టీబీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలం తర్వాత గ్రామ పంచాయతీ పోలింగ్ గురువారం జరగనుంది. తొలి విడత జిల్లాలోని ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మంథని మండలంలోని 3, రామగిరి మండలంలో ఒక గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు సంధించారు.
తొలి విడతలో ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఈనెల 11న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పంచాయతీలకు పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం రోజులపాటు పల్లెలో హోరెత్తిన ప్రచారం ముగిసిపోగా, పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటుకు నోటుకు, ఇంటింటా మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్ని రోజులు మోత మోగిన మైక్లు మంగళవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య ర్థులకు గుర్తుల గుబులు పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకమే కావడంతో ఓటర్లు గుర్తుంచు కునేలా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్న చోట పెద్దగా ఇబ్బంది లేకపోయినా, అంతకు మించి అభ్యర్థులు ఉన్న చోట క్రాస్ ఓటింగ్ జరుగుతుందోమోననే భయం పట్టు కున్నది. సర్పంచ్కు ఒకటి, వార్డు సభ్యుడి కోసం మరొక బ్యాలెట్ ఉండడం, ఓటర్లు రెండింటిపై ఓట్లు వేయాల్సి రావడంతో గుర్తుల విషయంలో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు.
గ్రామ పంచాయతీ ఎన్ని కల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన మొదటి విడత ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
మున్సిపాల్టీల పరిధి లో ఇంటి, నీటి పన్నుల వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాం త వాతావరణంలో పారదర్శకంగా మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ మహేష్ బీ గితే తెలి పారు.