జి ల్లాలో మోస్తరుతోపాటు చిరుజల్లులతో కూడి న వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సగటున 11.0మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజపేటలో 17.6 మి.మీ, పో చంపల్లిలో 17.3మి.మీ వర్షం కురిసింది.
వానాకాలం సీజన్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండగా, రెండు వారాల కిత్రం వరిని సాగుచేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. దీంతో వారం రోజులుగా వరి నాట్లు ఊపందుకున్నాయి.
హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
విద్యార్థి దశలో క్రీడలు ఎంతో ముఖ్యం. చదువుతో పాటు క్రీడాలకు ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పిల్లలు ధృడంగా తయారవుతారు. ఒకప్పుడు క్రీడలకు విద్యాసంస్థల్లో ప్రాధాన్యమిచ్చేవారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పక్షం రోజుల్లో సాగు పరిస్థితులు తారుమారయ్యాయి. 15 రోజుల కింది వరకు అనావృష్టి ఉండగా ఇప్పుడు అతివృష్టి నెలకొంది.
నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఓపెన్ చేయడంతో పర్యటకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది పర్యాటకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యతో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని సీపీఐ జాతీ య సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్ట్ మురళీతో కలిసి శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన సముదాయాన్ని రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.