రుతుపవనాలు మే నెలాఖరులోనే రాగా, వానాకాలం ముందస్తుగా మురిపించింది. ఆ తరువాత మోస్తరుతో పాటు చిరుజల్లులే కురిశాయి. దీంతో రైతులు ఎన్నో ఆశలతో వానాకాలం సాగుపనులు ప్రారంభించారు. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేకపోవడంతో సాగుపై ప్రభావం పడింది.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు సూచిస్తే(రెఫర్) ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిని సోమవారం పరిశీలించారు. వసతులను, వైద్య సేవలను, ఆస్పత్రి నిర్వహణను పరిశీలించి రోగులతో మాట్లాడారు.
పాడి రైతులకు మద ర్ డెయిరీ ఈ నెల 20లోగా ఆరు బిల్లులను చెల్లించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి హెచ్చరించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అసమ్మతి గ ళం కాంగ్రె్సలో దుమారం రేపుతోంది. రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి విషయంలో రోజుకో ఘటన తెరమీదకు వస్తోంది. తాజాగా ఈ నెల 10వ తేదీన ఒక టీ వీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రాజగోపాల్రెడ్డి వాదనకు బలం చేకూర్చేలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
వానాకాలం వచ్చిందంటే చాలు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల గుండెల్లో దడ మొదలవుతుంది. హైదరాబాద్నగరంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన పక్షంలో... రాత్రికి రాత్రే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
కోదాడటౌన్, ఆగస్టు 9(ఆంద్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణతోనే జీవకోటి మనుగడ సాధ్యమని పరిరక్షణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు.
సూర్యాపేటటౌన్, : ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శంకర్ అన్నారు.
మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లో పెరిగిపోతున్న కలుపు మొక్కలను తీయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.