నాగార్జునసాగర్, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో చేప ట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి జన్మదినం నవంబరు 8న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మూసీ నది ప్రక్షాళనకు ఇచ్చిన వాగ్దానం ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రశ్నించారు. గురువారం భువనగిరిలో జరిగిన బీజేపీ జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
అధికారుల ‘పల్లె నిద్ర’తో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని దూదివెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ పల్లెనిద్ర నిర్వహించారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, రహదారుల వెంట ఉన్న వ్యాపారుల స్వార్థం, మితిమీరిన రాజకీయ జోక్యంతో జిల్లా కేంద్రం భువనగిరిలో రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.
తల్లిదండ్రుల బాగోగులను విస్మరించిన కుమారులపై చర్యలు తప్పవని వయోవృద్ధుల ట్రిబ్యునల్ సబ్ డివిజనల్ చైర్మన, ఆర్డీవో ఎం.క్రిష్ణారెడ్డి అన్నారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధి మొదటిజోన్లోని చివరి భూములకు సాగు నీరందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఎత్తిపోతల పథకాల పనులు ఇంకా పునాదుల్లోనే కదలాడుతున్నాయి.
డిండి, తిరుమలగిరి(సాగర్), ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ యాం త్రీకరణ పరికరాలు రాయితీపై అందజేస్తున్నట్లు ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు రెహెనా, హర్షిత గురువారం తెలిపారు.
(ఆంధ్రజ్యోతి- మిర్యాలగూడ టౌన్) మిర్యాలగూడ పట్టణం వేగంగా అభివృద్ధి చెందు తుండడంతో పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగు తోంది. దీంతో పట్టణ పరిధి కూడ విస్తరిస్తుంది.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ అయింది.రాజ్గోపాల్ రెడ్డితో గురువారం ఫోన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడనున్నారు. తరచూగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీరుపై రాజ్గోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకకు అనుమతులు తీసుకుని ఇసుక రావాణ చేసే ట్రాక్టర్ల యజమానులు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.