చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులు చివరకు శ్మశాన వాటిక స్థలాన్ని సైతం వదలడం లేదు.
కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు.
భువనగిరి పట్టణ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్ డిమాండ్చేశారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించడం సరికాదని, దేశ వ్యాప్తంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సీపీఎం జిల్లా కమిటీసభ్యుడు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
రాజకీయాలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని మునుగో డు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో నిర్మించనున్న 33 కేవీ సబ్ స్టేషన్ల పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
మహిళా శక్తి భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొనసాగుతున్న భవ న నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మహిళా శక్తి భవనంలో జిల్లా సమాఖ్య ప్రధా న కార్యాలయం, శిక్షణా కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ నిర్మాణాల వివరా లు అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వ రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి హరీ్షరావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం హైదరాబాద్ లో ఆయన ఇచ్చిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ స్ర్కీన్పై స్థానిక నాయకులు, కార్యకర్తలు వీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే అంతకుముందు పంపిణీకి సిద్ధంగా ఉంచిన, రేషన్ దుకాణాల్లో మిగిలిన దొడ్డు బియ్యాన్ని వేలం వేయాలని నిర్ణయించింది.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఇద్దరు కానిస్టేబుళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సరైన పత్రాలు లేని, గంజాయి కేసుల్లో వదిలి వెళ్లిన బైకులను..