తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కల్వకుంట్ల కవిత.. ఈ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 25 లక్షల మంది బీసీ జనాభా ఉంటే.. వారిలో ఒక్క బీసీ వర్గానికి చెందిన వారు లేరని గుర్తు చేశారు.
జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ముందస్తు ఆర్డర్స్ ఇచ్చిన వారికి 40 శాతం డిస్కౌంట్ అంటూ అడ్వాన్స్ వసూలు చేసి బోర్డు తిప్పేసారు ఓ ట్రేడర్స్ షాపు.
స్థానికంగా ఉపాధి దొరకక దేశం కాని దేశాలకు వలసవెళ్తున్న జిల్లా వాసుల పరిస్థితి రోజురోజుకి అక్కడ ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ సరైన ఉపాధి లేక, వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేక గల్ఫ్ బాట పడుతున్న జిల్లా వాసులకు ఏజెంట్ల మోసాలు, అక్కడి చట్టాలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.
ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నా.. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్లో పర్యటిస్తారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు.
Nizamabad News: పుట్టే బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ తండ్రి. బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూశాడు. కానీ చివరకు పుట్టిన బిడ్డ గురించి వైద్యులు చెప్పింది తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్, నవీన్, మధుకర్గౌడ్ బ్యాక్ వాటర్లో గల్లంతయ్యారు.
Telangana Landmine Blast: మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి తెలంగాణ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీధర్ మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.