Errabelli Dayakar Rao: రెేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.
శ్రీరామ నవమి సందర్భంగా జనగామ జిల్లా వల్మిడి గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులంతా బంధుమిత్రులను పిలుచుకుని వేడుకకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.
BRS Warangal Meeting: బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ హై కమాండ్ ప్లాన్ చేసింది. ఇందుకోసం గులాబీ బాస్ కేసీఆర్ వరుసగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.
మావోయిస్టు నేత రేణుక అలియాస్ భాను, సుధీర్లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా బెల్నార్లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.
వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.
Minister Seethakka: మంత్రి సీతక్క ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త కుంజా రాము వర్థంతి సభలో సీతక్క కంటతడి పెట్టారు. సీతక్క కన్నీరు పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చారు.
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.