మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.
వరంగల్ జిల్లా జాఫర్ఘడ్లో మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో NIA అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రలోభాల జాతర కొనసాగింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భార్యను ఉరివేసి హత్య చేసి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.
గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది.
పంచాయతీ పోలింగ్ సమీపించడంతో అభ్యర్థు ల్లో టెన్షన్ మొదలైంది. ఇన్ని రోజులుగా సాధారణంగా కనిపించిన అభ్యర్థుల గుండెల్లో దడ మొదలైంది.
గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో మద్యం, మటన్, విందులతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుల్లో ఎక్కువ భాగం మద్యంపైనే వెచ్చిస్తున్నారు. అభ్యర్థులు ప్రలోభాల ద్వారానే అధికంగా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.